
మెహిదీపట్నం, వెలుగు: వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్చేశారు. సౌత్ వెస్ట్జోన్డీసీపీ చంద్రమోహన్ మంగళవారం మెహిదీపట్నంలోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆసిఫ్ నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన మహమ్మద్ నజీబ్(35) ల్యాబ్ టెక్నీషియన్. ఈ నెల 1న విజయ నగర్ కాలనీకి చెందిన చంద్రకళ(65) షాప్లో పాల ప్యాకెట్ కొనుక్కొని, ఇంటికి వెళ్తోంది.
అదే సమయంలో వెనక నుంచి బైక్పై వచ్చిన నజీబ్ఆమె మెడలోని 2 తులాల గొలుసును లాగేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించదంతో కింద పడేసి మరీ గొలుసును లాగే ప్రయత్నంలో తెగిపోయింది. 1.4 గ్రాములు చేతికి చిక్కడంతో తీసుకొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడు మంగళవారం మల్లేపల్లి ఎక్స్ రోడ్డులో గొలుసు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి, అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నజీబ్ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి కి అలవాటు పడి, విలాసవంతమైన జీవితం గడిపేందుకు దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిక్, ఆసిఫ్ నగర్ ఏసీపీ విజయ్ శ్రీనివాస్, మెహిదీపట్నం సీఐ ఎస్.ఎస్.మల్లేశ్, డీఐ బాలకృష్ణ, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.