చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ప్రభుత్వం తరఫున నిర్వహించారు. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ కేవలం ఒక కులానికి మాత్రమే
సంబంధించిన వ్యక్తి కాదని, యావత్ తెలంగాణ జాతి ఆస్తి అని మంత్రులు అన్నారు.