హైకోర్టు తీర్పుతో రాష్ట్ర సర్కార్ కొత్త సీఎస్గా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈసారి తెలుగు వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రేసులో స్పెషల్సీఎస్ లు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో రామకృష్ణారావు ఏపీకి చెందినవారు. ఆయనకే ఎక్కువ శాతం అవకాశం ఉందని సమాచారం.
ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా పని చేస్తున్నారు. సునీల్ శర్మ, శాంతకుమారి, వసుధా మిశ్రా, రాణి కుముదిని కూడా స్పెషల్ సీఎస్లుగా ఉన్నారు. అయితే వసుధా మిశ్రా సెంట్రల్ సర్వీస్లో ఉండగా వచ్చే నెలలో రిటైర్అవుతున్నారు. రాణి కుముదిని జులైలో, రజత్ కుమార్ నవంబర్లో రిటైర్ కానుండగా అరవింద్కుమార్ సెంట్రల్ సర్వీస్లోకి వెళ్లడానికి అప్లై చేసుకున్నారు.