రామకృష్ణారావుకు సీఎస్​గా చాన్స్..!

రామకృష్ణారావుకు సీఎస్​గా చాన్స్..!

హైకోర్టు తీర్పుతో రాష్ట్ర సర్కార్ కొత్త సీఎస్​గా ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఈసారి తెలుగు వారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రేసులో స్పెషల్​సీఎస్ లు రామకృష్ణారావు, అరవింద్​ కుమార్, రజత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో రామకృష్ణారావు ఏపీకి చెందినవారు. ఆయనకే ఎక్కువ శాతం అవకాశం ఉందని సమాచారం.

ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్​గా పని చేస్తున్నారు. సునీల్ శర్మ, శాంతకుమారి, వసుధా మిశ్రా, రాణి కుముదిని కూడా స్పెషల్ సీఎస్​లుగా ఉన్నారు. అయితే వసుధా మిశ్రా సెంట్రల్​ సర్వీస్​లో ఉండగా వచ్చే నెలలో రిటైర్​అవుతున్నారు. రాణి కుముదిని జులైలో, రజత్ కుమార్​ నవంబర్​లో రిటైర్ కానుండగా అరవింద్​కుమార్​ సెంట్రల్​ సర్వీస్​లోకి వెళ్లడానికి అప్లై చేసుకున్నారు.