షార్ట్ ఫిలింస్తో కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది చాందిని చౌదరి. చేసింది తక్కువ ప్రాజెక్టులే అయినా డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటోంది. త్వరలో ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల మందుకొచ్చేందుకు రెడీ అవుతున్న చాందిని చేతికి మరో మూవీ వచ్చింది. ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో తెరకెక్కుతోన్న ‘యేవమ్’ చిత్రలో చాందిని నటిస్తుందని ప్రకటించారు.
భరత్ రాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను లాంచ్ చేశారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. నటుడు నవదీప్ సీ స్పేస్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. నీలేష్ మండాలపు, కీర్తన శేష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.