నేను ఏ తప్పూ చేయలేదు.. నాకోసం సంఘీభావం తెలిపిన వారికి అభినందనలు: చంద్రబాబు

నేను ఏ తప్పూ చేయలేదు.. నాకోసం సంఘీభావం తెలిపిన వారికి అభినందనలు: చంద్రబాబు

చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత   మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ  జీవితంలో తానే ఏ తప్పూ చేయలేదని తెలిపారు.  తాను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వచ్చి పోరాడారని.. ఇంకా పూజలు చేశారని.. వారందరికి  అభినందనలు తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా తనకు మద్దతుగా పోరాడిన వారి అభిమానాన్ని తన జీవితంలో మర్చిపోలేనన్నారు.  తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేశానని.. ప్రభుత్వ విధానాల వల్ల చాలా మందికి ప్రయోజనం కలిగిందన్నారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగంగా తనకు మద్దతు ప్రకటించారని .. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో అన్నారు.  కొంతమంది కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా సంఘీభావం తెలిపారన్నారు.  టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేశారని.. తనకు కష్టం వచ్చినప్పుడు విదేశాల్లోని తెలుగువారు తనకు మద్దతు తెలిపారని తెలిపారు.  టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడారని... హైదరాబాద్ నుంచి స్వచ్ఛందంగా వచ్చిన  ఐటీ ఉద్యోగులు తనకు సంఘీభావం తెలిపారన్నారు.