ఖమ్మం సభ సక్సెస్పై నేతలకు చంద్రబాబు అభినందన

ఖమ్మం సభ సక్సెస్పై నేతలకు చంద్రబాబు అభినందన

హైదరాబాద్, వెలుగు: ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన టీడీపీ పబ్లిక్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ కావడంపై ఆ పార్టీ నేతలను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అభినందించారు. మంగళవారం చంద్రబాబుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ కంబంపాటి రామ్మెహన్ రావు, అట్లూరి సుబ్బారావుతో పాటు పలువురు భేటీ అయ్యారు. 

వచ్చే నెల్లో నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో పబ్లిక్ మీటింగ్ లు నిర్వహిస్తామని బాబుకు కాసాని ప్రతిపాదించారు. ఖమ్మం మీటింగ్ పై కాసానిని ‘‘శభాష్ గో అహెడ్”అంటూ అభినందించినట్టు సమాచారం. కాగా, ఇటీవల కన్నుమూసిన నటులు సత్యనారాయణ, చలపతిరావు  కుటుంబాన్ని చంద్రబాబు  పరామర్శించారు. వాళ్ల ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.