చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు పడింది. ఖైదీలతో ములాకత్ కు వచ్చే మహిళలను వేధిస్తున్నాడని దశరథంపై ఆరోపణలు రావడంతో జైళ్ల శాఖ డీజీ జితేందర్ చర్యలు తీసుకున్నారు. తమను వేధిస్తున్నాడంటూ పలువురు మహిళలు జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన ఉన్నతాధికారులు విషయాన్ని డీజీ వద్దకు తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన పరిపాలనకు భంగం కలిగిస్తున్నాడనే ఆరోపణలపై సూపరింటెండెంట్ దశరథం పై చర్యలకు ఆదేశించారు. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి చింతల దశరథంను బదిలీ చేశారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని దశరథానికి హెచ్చరికలు చేశారు.