
ఘట్కేసర్, వెలుగు: మేడ్చల్ బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డిపై ఘట్కేసర్ పీఎస్లో చీటింగ్కేసు నమోదైంది. బాధితుడి వివరాల ప్రకారం.. అవుశాపూర్లో 2,057 గజాల్లో ఉన్న తన భవనాన్ని 2023 నవంబర్లో ఉప్పల్కు చెందిన నల్ల ఆనిరెడ్డికి రూ. 1.25 కోట్లకు సుదర్శన్రెడ్డి విక్రయించారు.
అయితే, భవనాన్ని ఆనిరెడ్డికి అప్పగించకుండా, నలంద జూనియర్ కాలేజీ ఇన్చార్జీ హరికృష్ణకు లీజుకు ఇచ్చాడు. దీంతో ఆనిరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురామ్ తెలిపారు.