బీజేపీ నేత సుదర్శన్ రెడ్డిపై చీటింగ్ కేసు

బీజేపీ నేత సుదర్శన్ రెడ్డిపై చీటింగ్ కేసు

ఘట్​కేసర్, వెలుగు: మేడ్చల్ బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డిపై ఘట్​కేసర్ పీఎస్​లో చీటింగ్​కేసు నమోదైంది. బాధితుడి వివరాల ప్రకారం.. అవుశాపూర్​లో 2,057 గజాల్లో ఉన్న తన భవనాన్ని 2023 నవంబర్​లో ఉప్పల్​కు చెందిన నల్ల ఆనిరెడ్డికి రూ. 1.25 కోట్లకు సుదర్శన్​రెడ్డి విక్రయించారు. 

అయితే, భవనాన్ని ఆనిరెడ్డికి అప్పగించకుండా, నలంద జూనియర్ కాలేజీ ఇన్​చార్జీ హరికృష్ణకు లీజుకు ఇచ్చాడు. దీంతో ఆనిరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశురామ్ తెలిపారు.