
కూకట్పల్లి, వెలుగు: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచటాన్ని నియంత్రిస్తూ సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి జేఎన్టీయూ విద్యార్థులు మద్దతు ప్రకటించారు. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ జేఎన్టీయూలో ఓ లేఖ విడుదల చేశారు. వర్సిటీ ప్రాంగణంలో ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. విద్యార్థి నాయకులు జవ్వాజి దిలీప్, రాహుల్నాయక్ మాట్లాడుతూ.. కాలేజీలను నిరంతరం తనిఖీలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.