చెన్నై : IPL సీజన్ -12లో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా ముంబైతో జరుగుతన్న మ్యాచ్ లో టాస్ గెలిచింది CSK. కెప్టెన్ సురేష్ రైనా పీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న ధోనీ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. సురైష్ రైనా కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకోగా.. ముంబై మరో రెండు మ్యాచ్ ల్లో గెలిస్తేనే టాప్-4కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో ముంబై మూడో స్థానంలో ఉంది. చెన్నైపై ప్రస్తుత సీజన్లో మరోసారి విజయం సాధించి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. ఆడిన 11 మ్యాచ్ ల్లో ఎనిమిదింట్లో గెలుపొంది..పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలో కొనసాగుతోంది. సీజన్ లో వాంఖడేలో తొలిసారి తలపడిన మ్యాచ్ లో చెన్నైని ముంబై మట్టికరిపించింది. ఇవాళ్టి మ్యాచ్ లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ధోనీసేన భావిస్తోంది.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
A look at the Playing XI for #CSKvMI
Live – https://t.co/fVonT9ZahO pic.twitter.com/0Vow61WzJl
— IndianPremierLeague (@IPL) April 26, 2019