చెన్నైసూపర్ కింగ్స్తో జరుగుతోన్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో లియామ్ లివింగ్స్టోన్(60), శిఖర్ ధావన్(33), జితేష్ శర్మ(26) పరుగులతో రాణించారు. చెన్నైసూపర్ కింగ్స్ బౌలర్లలో డ్వైన్ ప్రిటోరియస్, క్రిస్ జోర్డాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, చౌదరి, జడేజా చెరో వికెట్ సాధించారు.
తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాతి ఓవర్లోనే రాజపక్స (5) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు పని అయిపోయిందని అభిమానులు అనుకున్నారు. అయితే మెగావేలంలో భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసిన లియామ్ లివింగ్స్టోన్ (60) దొరికిన బంతిని దొరికినట్లే బాదేశాడు. దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ మళ్లీ పట్టాలెక్కింది. అతనికి ధవన్ (33) అండగా నిలిచి మరో వికెట్ పడనీయలేదు. వీళ్లిద్దరూ కలిసి మూడో వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Innings Break!@PunjabKingsIPL post 1⃣8⃣0⃣/8⃣ on the board on the back of @liaml4893's cracking 6⃣0⃣. ? ?@CJordan & Dwaine Pretorius picked 2⃣ wickets each for @ChennaiIPL. ? ?
— IndianPremierLeague (@IPL) April 3, 2022
The #CSK chase to begin shortly. #TATAIPL | #CSKvPBKS
Scorecard ▶️ https://t.co/ZgMGLamhfU pic.twitter.com/7EgimNQIlL