కాళేశ్వరం మిత్తే 50 వేల కోట్లు కడుతున్నం: వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం మిత్తే 50 వేల కోట్లు కడుతున్నం: వివేక్ వెంకటస్వామి

లక్ష కోట్లు అప్పు తెచ్చి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే..దాని మిత్తే 50 వేల కోట్లు కడుతున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. ఐదేండ్లల్లో 940 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది..కేవలం 168 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారన్నారు. 17లక్షల ఎకరాలకు నీరివ్వాల్సిన ప్రాజెక్టు..కేవలం 90వేల ఎకరాలకే నీళ్లిచ్చారని ఆరోపించారు వివేక్. కాంట్రాక్టర్లను ధనికులను చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు. 

విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం

రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు MLA వివేక్ వెంకటస్వామి. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు వివేక్ వెంకటస్వామి. ఇందారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ కు భూమిపూజ చేశారు. 20 లక్షల రూపాయల నిధులతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖాజీపల్లి గ్రామంలో 3లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్.