
భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీని బీసీసీఐ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ కొత్త చైర్మన్ గా మరోసారి చేతన్ శర్మ ఎంపికయ్యారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా శివ సుందర్ దాస్,సుబ్రోతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లు అవకాశం దక్కించుకున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా దారుణ వైఫల్యం నేపథ్యంలో సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఖాళీ స్థానాల కోసం ధరఖాస్తలు అహ్వానించింది. నవంబరు 18న 5 పోస్టుల కోసం దరఖాస్తులు కోరగా.. మొత్తం 600 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 11 మందిని షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి, ఫైనల్ గా ఐదుగురిని ఎంపిక చేసింది. ఈ కమిటీకి చైర్మన్గా చేతన్ శర్మ ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టు ఆడే ఆటగాళ్లను ఆ కమిటీ ఎంపిక చేస్తుంది.