OTT Thriller Review: ఉత్కంఠరేపే మిస్టరీ థ్రిల్లర్.. ఒక హత్య.. 9 మంది అనుమానితులు..

OTT Thriller Review: ఉత్కంఠరేపే మిస్టరీ థ్రిల్లర్.. ఒక హత్య.. 9 మంది అనుమానితులు..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకులకు తెగ పిచ్చి. ఒక మర్డర్ను ఛేదించడానికి వచ్చిన పోలీసుల ఇన్వెస్టిగేషన్, క్రైమ్ స్పాట్లో వస్తువులను పరిశీలించే ఫోరెన్సిక్ టీమ్, ఆ తర్వాత అటాప్సీలో వచ్చే అసాధారణమైన రిపోర్ట్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తోంది.

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏ భాషా నుండి వచ్చిన.. మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. వాటిని హిట్ చేస్తారు. ఇప్పుడాలాంటి సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చింది? ఒక హత్య, దాని చుట్టూ 9 మంది అనుమానితులు, ఓ పోలీసు ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్.. మరి ఆ సినిమా ఏంటీ? అదెక్కడ స్ట్రీమ్ అవుతుంది? దాన్ని కథేంటీ? అనే విషయాలు తెలుసుకుందాం. 

ఛల్ కపట్ ఓటీటీ:

లేటెస్ట్ బాలీవుడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఛల్ కపట్ (Chhal Kapat). ఈ థ్రిల్లర్ సిరీస్ జీ5 ప్లాట్ఫాంలో శుక్రవారం (జూన్ 6)న స్ట్రీమింగ్కు వచ్చింది. ఒక హత్య చుట్టూ ముడిపడిన చిక్కులను ఛేదించే సీన్స్ ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి. హత్య ఎవరు చేశారన్న సస్పెన్స్ మాత్రం మూవీ చివరి వరకూ కొనసాగుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిచే సీన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ సీరియల్ మాదిరి స్క్రీన్ ప్లేతో సాగడం మైనస్. 

ALSO READ | Baahubali: ‘బాహుబలి’ రీ రిలీజ్‌తో సరికొత్త ప్రయోగం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్కి మళ్లీ ప్రభంజనమే!

ఈ వెబ్ సిరీస్ ను అజయ్‌‌‌‌భుయాన్‌‌‌‌ డైరెక్ట్ చేశాడు. 7 ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ రన్ టైమ్ కూడా తక్కువే ఉంది. ఒక్కో ఎపిసోడ్ గరిష్ఠంగా 25 నిమిషాలు ఉంటుంది. కొన్ని 16 నిమిషాల్లోనే ముగిసేవి కూడా ఉన్నాయి. దీంతో రెండు, రెండున్నర గంటల్లోనే ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఇందులో శ్రియా పిల్గావ్‌‌‌‌కర్, స్మరన్ సాహు, తుహినా దాస్, రాగిణి ద్వివేది, యాహ్వే శర్మ, అనుజ్ సచ్‌‌‌‌దేవా, కేశవ్ లోక్వాని,  కామ్యా అహ్లవత్​ కీలక పాత్రల్లో నటించారు. 

‘ఛల్ కపట్’ కథేంటంటే:

జుగల్ (స్మరన్ సాహు), అలీషా (కామ్య అహ్లవత్)ల నిశ్చితార్థానికి పెద్దలు ముహూర్తం ఫిక్స్‌‌‌‌ చేస్తారు. ఆ ఈవెంట్‌‌‌‌ అలీషా పూర్వీకుల హవేలీ (ప్రైవేట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌)లో జరుగుతుంది. దానికి తన చిన్ననాటి స్నేహితులు ఇరా (తుహినా దాస్), మెహక్ (రాగిణి ద్వివేది), షాలు (యాహ్వేశర్మ)ని పిలుస్తుంది. మెహక్‌‌‌‌తోపాటు ఆమె భర్త, మంత్రి కొడుకు విక్రమ్ (అనుజ్ సచ్‌‌‌‌దేవా) వెళ్తాడు. ఇరా మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న తన బిడ్డతో వెళ్తుంది. 

సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ షాలు తనకు హెల్ప్‌‌‌‌ చేయడానికి సపన్ (కేశవ్ లోక్వాని)ని వెంట తీసుకెళ్తుంది. ఇలా అందరూ హవేలీకి చేరుకుంటారు. ఆ మరుసటి రోజు షాలు అనుమానాస్పద పరిస్థితుల్లో పక్కనే ఉన్న ఒక చెరువులో మునిగి చనిపోతుంది. అప్పుడే ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్పీ దేవికా రాథోడ్ (శ్రియా పిల్గావ్‌కర్) ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగుతుంది. 

విక్రమ్ తన పలుకుబడితో కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి పెంచుతాడు. ఈ కేసును తీవ్రంగా పరిగణించి తన దర్యాప్తును మొదలుపెడుతుంది. అలా తనతో పాటు ఉన్న తొమ్మిది మంది అనుమానితులను ఎస్పీ దేవికా అరెస్ట్‌‌‌‌ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? షాలు చావుకి కారణమేంటి? అసలు హంతకుడు ఎవరన్నది దేవిక ఎలా కనిపెట్టిందనేది తెలియాలంటే ఈ వెబ్‌‌‌‌సిరీస్‌‌‌‌ చూడాలి. 

అయితే, ఇది తెలుగులో మాత్రం లేదు. హిందీలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు.