చత్తీస్గఢ్ బాలుడికి భద్రాచలంలో వైద్యం

చత్తీస్గఢ్ బాలుడికి భద్రాచలంలో వైద్యం
  • తీవ్ర రక్తహీనతకు చికిత్స అందించిన ఏరియా ఆస్పత్రి వైద్యులు  
  • అభినందించిన కలెక్టర్ 

భద్రాచలం, వెలుగు: తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న చత్తీస్​గఢ్​రాష్ట్రానికి చెందిన ఓ బాలుడికి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా హాస్పిటల్​డాక్టర్లు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్​గఢ్​లోని కిష్టారం గ్రామానికి చెందిన గిరిజన బాలుడు మల్లం నరేశ్​తీవ్రమైన ఆయాసం, పొట్ట ఉబ్బడం, ఒళ్లంతా మచ్చలు, జ్వరంతో బాధ పడుతుండగా తండ్రి ఈ నెల 5న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేశాక నరేశ్​కు తీవ్ర రక్తహీనత ఉందని పిల్లల వైద్యుడు రాజశేఖర్​రెడ్డి తేల్చారు. 10 నుంచి 14 గ్రాములు ఉండాల్సిన రక్తం ఒక గ్రాము కంటే తక్కువ ఉండటంతో వైద్యులు విస్తుపోయారు.

వెంటనే చికిత్స ప్రారంభించడంతో రక్తం దాదాపు 8 గ్రాములకు పెరిగింది. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో గురువారం డిశ్చార్జ్​చేశారు. డీసీహెచ్ రవిబాబు ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్ జితేశ్​వి.పాటిల్ బాలుడితోపాటు అతని తండ్రి, అక్క, డాక్టర్​రాజశేఖర్​రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్​డాక్టర్​రామకృష్ణను కలెక్టరేట్​కు పిలిపించారు. తల్లి లేకపోవడంతో ఆరేండ్ల సోదరే నరేశ్​ను దగ్గరుండి చూసుకుందని తెలిసి చలించిపోయారు. వారికి పండ్లు అందజేశారు. హైదరాబాద్​లోని నీలోఫర్​వంటి పెద్ద హాస్పిటళ్లు, కార్పొరేట్​ఆస్పత్రుల్లో చేసే వైద్యాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అందించిన డాక్టర్లను అభినందించారు.