చత్తీస్ ఘడ్ లోని కొండాగావ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీని బొలేరో వాహనం ఢీకొనడంతో… నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన లారీ ఎదురుగా వచ్చి.. బోలేరును బలంగా ఢీ కొట్టింది. లారీ ధాటికి బొలేరో వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రమాద స్తలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25వేల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు కలెక్టర్.
Chhattisgarh: At least 4 people dead in a collision b/w truck & a car last night on NH-30 in Kondagaon. N Tekam, Kondagaon Collector, says,“Compensation of Rs. 25,000 each will be given to the families of those who died & free medical treatment for those injured in the accident.” pic.twitter.com/uIqzFVMHrq
— ANI (@ANI) March 16, 2019