
తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. నూతన భవనం దగ్గరకు వెళ్లనున్న సీఎం.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 2 లోపు సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం ప్రారంభించాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ పనులను పరిశీలించేందుకు వెళ్తున్నారు సీఎం కేసీఆర్.