మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్కు కరోనా వైరస్ పాజిటివ్గా తెలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్కు వెళ్లాలని సూచించారు.”నాకు కరోనా పాజిటివ్గా తేలింది. కొన్ని రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతుండగా.. ఆదివారం జరిపిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకొని, క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని బైరెన్ సింగ్ అన్నారు. ప్రస్తుతం తన ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, హోం క్వారంటైన్లో ఉన్నానని వివరించారు.