జనగామ జిల్లాలో వనమహోత్సవాన్ని సక్సెస్చేయాలి : కె.రామకృష్ణారావు

జనగామ జిల్లాలో వనమహోత్సవాన్ని సక్సెస్చేయాలి : కె.రామకృష్ణారావు

జనగామ అర్బన్, వెలుగు: ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్​ నుంచి సీఎస్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్​నిర్వహించారు. ఆన్​లైన్​నుంచి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ వీడియో కాన్పరెన్స్​లో జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ అడిషనల్​కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్​ సింగ్​తో కలిసి పాల్గొన్నారు. 

సీఎస్​ కలెక్టర్​సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తూ వనమహోత్సవాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు ఆవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించి పక్కాగా డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. భూ భారతి సదస్సులలో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్​డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత్​ నాయక్, ఆర్డీవోలు గోపీరామ్, డీఎస్​ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.