చిన్నారికి తొలి కుల, మత రహిత సర్టిఫికెట్

చిన్నారికి తొలి కుల, మత రహిత సర్టిఫికెట్

తమ పిల్లలను స్కూల్ లో చేరిపించే సమయంలో.. వాళ్లు ఇచ్చే దరఖాస్తు పత్రాన్ని నింపాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. అందులో కులం, మతం అనే కాలమ్ కూడా ఉంటుంది. దీనిని కూడా నింపాల్సి ఉంటుందని కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు చెబుతుంటాయి. అలాగే ఓ తల్లిదండ్రుల విషయంలో కూడా అదే జరిగింది. కానీ.. తమ చిన్నారిని కుల మతాల పేరిట నిర్భందించడం వారికి ఇష్టం లేదు. దీంతో తమ చిన్నారికి కుల, మత రహిత ధృవీకరణపత్రం ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. దీంతో వారు కోరుకున్న విధంగానే ధృవీకరణపత్రం అందచేశారు. తమిళనాడులో జారీ అయిన తొలి కుల, మత రహిత సర్టిపికేట్ ఇదే.

అసలు ఏం జరిగింది ? 
నరేష్ అనే వ్యాపార వేత్త తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. దంపతులకు మూడున్నరేళ్ల కుమార్తె ఉంది. ఇతను ఓ డిజైన్ సంస్థను నడుపుతున్నారు. తమ మూడున్నరేళ్ల చిన్నారిని స్కూల్లో చేరిపించాలని అనుకున్నారు. కిండర్ గార్డెన్ స్కూల్ కు వెళ్లారు. వాళ్లు ఇచ్చిన దరఖాస్తు ఫామ్ లో కులం, మతం అనే కాలమ్ ఉంది. ఈ కాలమ్ ను ఖాళీగా వదిలేస్తే సీటు ఇవ్వమని తేల్చిచెప్పారు. దీంతో మరికొన్ని స్కూళ్లకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. ఇలా 22 ప్రైవేటు పాఠశాలలకు వెళ్లారు. ప్రతొక్కరూ ఆ కాలమ్ ను పూర్తి చేయాలని చెప్పారు. ఏ స్కూల్ కు వెళ్లినా.. దరఖాస్తు ఫామ్ లో ‘నో క్యాస్ట్ - నో రిలీజియన్’ అనే కాలమ్ లేదని గ్రహించారు. వాస్తవానికి 1973లో ప్రభుత్వం ఓ ఉత్తర్వు జారీ చేసిందని, పిల్లలను స్కూల్లో చేర్చుకొనే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదని పేర్కొనడం జరిగిందని స్కూళ్ల యాజమాన్యాలకు తెలియ చేయడం జరిగిందని నరేష్ తెలిపారు. తల్లిదండ్రులు చెబితే ఆ కాలమ్ ను ఖాళీగా వదిలిపెట్టేందుకు అనుమతించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలున్నాయి. 

కలెక్టర్ ను ఆశ్రయించిన దంపతులు
ఈ అంశాన్ని పరిష్కరించుకొనేందుకు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్ ను సంప్రదించారు నరేష్ దంపతులు. ఇందుకు తాను ఓ అఫిడవిట్ ను సమర్పించాల్సి వచ్చిందని, కుల, మత రహిత సర్టిపికేట్ వల్ల ప్రభుత్వ రిజర్వేషన్లకు, ప్రత్యేకాధికారులుక తమ కుమార్తె అనర్హులిగా మారుతుందని తమకు తెలసని వారు అఫిడవిట్ లో పొందుపరిచారు. అనంతరం కోయంబత్తూరు నార్త్ తహసీల్దార్ వారికి ‘నో రిలిజియన్ - నో క్యాస్ట్’ సర్టిఫికేట్ జారీ చేశారు. కులం, మతం ప్రకటించకూడదనే నిబంధన గురించి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు తెలియకపోవడం దురదృష్టకరమని నరేష్ వ్యాఖ్యానించారు. విద్యా విధానం కారణంగానే ఇలాంటి నిబంధనల గురించి ప్రజలకు తెలియదని, తాను ఏ మతాన్ని నమ్మనని, మతాలకతీతంగా పవిత్ర గ్రంథాలు చదివినట్లు చెప్పారు. ఓ వ్యక్తి తక్కువ.. మరొకరు ఉన్నతమైన వారని చెప్పే వ్యవస్థ ప్రస్తుతం ఉందని.. ఇది న్యాయమైనా అని ప్రశ్నించారు. అంబేద్కర్, పెరియార్ రచనలను తనను ప్రభావితం చేసినట్లు చెప్పారు. ఇలాంటి సర్టిఫికేట్ పొందేందుకు మరింత మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు నరేష్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం : -
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌‌ని విచారిస్తున్న పోలీసులు


జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్ ?