
వర్గల్, వెలుగు: నిద్రలో దొర్లుకుంటూ వెళ్లి రిఫ్రిజిరేటర్కు తగలటంతో షాక్తగిలి ఓ చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన ఎరుకల కుమార్, భవానీల పాప కావ్యశ్రీ(4 నెలలు). ఎప్పటిలాగే తల్లి పక్కన పడుకున్న చిన్నారి దొర్లుతూ వెళ్లి రిఫ్రిజిరేటర్కు తాకింది. షాక్కొట్టడంతో పాప నిద్రలోనే మృతిచెందింది. తెల్లవారుజామున మూడు గంటలకు చూసుకునేసరికి ఫ్రిజ్పక్కన పాప మృతిచెంది ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.