
పారిస్: ఒలింపిక్స్ చరిత్రలో చైనా 300వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన విమెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ గోల్డ్ నెగ్గడంతో ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనా టీమ్ 3–0తో జపాన్ను ఓడించింది. ఫలితంగా ఈసారి గేమ్స్లో అందుబాటులో ఉన్న ఐదు టీటీ గోల్డ్ మెడల్స్ను చైనానే గెలవడం విశేషం.