ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్కను బీఎన్ రెడ్డి నగర్లోని ఆయన నివాసంలో శుక్రవారం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు.
అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క డిప్యూటీ పదవికి పేరు తీసుకొస్తారన్నారు. భట్టి విక్రమార్కను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, గ్రేటర్హైదరాబాద్అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శశికాంత్, గోకుల్ కల్యాణ్ ఉన్నారు.