
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) గురువారం అర్ధరాత్రి పమాదవశాత్తు కాలు జారిపడటంతో..ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించగా..కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయంపై ట్వీట్ చేశారు. 'కేసీఆర్ గారు గాయపడ్డారని తెలిసి చాలా బాధపడ్డాను.ఇవాళ ఆయనకు జరుగుతున్న సర్జరీ విజయవంతమై..త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేసీఆర్కు గాయం కావడంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లో తెలిపారు.
Deeply pained to learn about the injury suffered by Sri KCR garu!
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2023
Wishing him a successful surgery and a very speedy recovery.