అర్హులందరికీ గొర్రెలు ఇస్తాం: చిట్టెం రామ్మోహన్​రెడ్డి

అర్హులందరికీ గొర్రెలు ఇస్తాం: చిట్టెం రామ్మోహన్​రెడ్డి

మరికల్, వెలుగు: వచ్చే నెల చివరి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ గొర్రెల యూనిట్లు అందజేస్తామని మక్తల్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని చిత్తనూర్​ గ్రామంలో 12 మంది లబ్ధిదారులకు గొర్రెలను అందజేశారు. 

గొర్రెల యూనిట్లు కొందరికే వచ్చాయని, మిగిలిన వారికి వస్తాయో లేదోనని పలువురు దరఖాస్తుదారులు అనుమానం వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సెప్టెంబర్​ చివరి వరకు అందరికీ గొర్రెలు ఇస్తామని భరోసా ఇచ్చారు. జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ సురేఖరెడ్డి, సర్పంచ్​ అరుంధతి, బీఆర్ఎస్​ నాయకులు శ్రీనివాస్​గుప్తా, రాజవర్ధన్​రెడ్డి, రఘునాథ్​రెడ్డి పాల్గొన్నారు.