హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భవన్ లో కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును మూసేసి స్టార్ హోటల్ గా మార్చి బిజినెస్ చేసుకుంటే మంచిదని ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్కు చొప్పదండి కాంగ్రెస్ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి తలచుకుంటే.. కేవలం 24 గంటల్లో బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు.
శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు.. కల్వకుంట్ల కుటుంబ నేతలను మించిన పవర్ బ్రోకర్లు ఇంకెవరూ ఉండరన్నారు.