నిర్మాణంలో ఉండగా కూలిన చర్చి.. నలుగురి పరిస్థితి విషమం

నిర్మాణంలో ఉండగా కూలిన చర్చి.. నలుగురి పరిస్థితి విషమం

సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్చి స్లాబ్‌ వేస్తుండగా చెక్కలు ఒక్కసారిగా కూలీలపై పడి.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శిథిలాల్లో మరో నలుగురు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

క్షతగాత్రులు యూపీకి చెందిన వారిగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.