ఏపీ వరద బాధితులకు సినీ ప్రముఖుల ఆర్థిక సాయం

ఏపీ వరద బాధితులకు సినీ ప్రముఖుల ఆర్థిక సాయం

యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఇటీవల ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఏపీలోని జిల్లాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. వరదల వల్ల ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. వారి కష్టాలను చూసి చలించిన జూ. ఎన్టీఆర్ తన వంతుగా సాయం ప్రకటించాడు. ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలిపారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి రూ. 25 లక్షలు సాయంగా ఇస్తున్నట్లు తెలిపారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు
ఏపీలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. వరదల్లో కొట్టుకుపోయి చాలామంది మరణించారు. అయితే వరదల వల్ల నష్టపోయిన వారికి ఆర్థికసాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని ఆయన అభ్యర్థించారు. కాగా.. మహేష్ కంటే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి
ఏపీ వరద విపత్తు కుటుంబాలను ఆదుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం ప్రకటించారు. తన వంతు సాయంగా రూ. 25 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్లు తెలిపారు.