గుండెపోటుతో సినీ గీత రచయిత కన్నుమూత

గుండెపోటుతో సినీ గీత రచయిత కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ సినీ గీత రచయిత శివ గణేశ్ కన్నుమూశారు. గురువారం వనస్థలిపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు.  ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్ తదితర చిత్రాలకు శివగణేశ్ పాటలు రాశారు. ఆయనకు ఇద్దరు కుమారులు సుహాస్, మానస్, భార్య నాగేంద్రమణి ఉన్నారు. ఆయన పాటలు రాసిన ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారుకాని, ఉల్లాసం, 7జీ బృందావన్ కాలనీ, ఆస్తి మూరెడు- ఆశ బారెడు చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి.