సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ కమిషన్ (UPSC)విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 13వేల మందికి పైగా అభ్యర్థులు సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించారు. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో ప్రిలిమ్స్ ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.తుది ఫలితాలు ప్రకటించిన తర్వాతే మార్కులు, కట్ ఆఫ్ మార్కులు, ఆన్సర్ కీలను కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని కూడా యూపీఎస్సీ తెలిపింది. 1087 ఖాళీలకు గానూ గతేడాది సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా 5లక్షల 49వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
