మెహిదీపట్నం, వెలుగు: ప్రజాపాలన చివరిరోజున కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. శనివారం టప్పా చబుత్రా పీఎస్ లిమిట్స్ లోని సాబేర్ నగర్ లో ప్రజాపాలన సెంటర్ లోని కేహెచ్ ఫంక్షన్ హాల్ వద్ద ప్రజల దరఖాస్తులను నింపేందుకు ఎంఐఎం నేతలు డబ్బులు తీసుకుంటున్నారని తెలియగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తన కార్యకర్తలతో వెళ్లా రు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే దరఖాస్తులను ఫ్రీగా అందిస్తుందని సూచించగా.. ఎంఐఎం నేతలు జోక్యం చేసుకోగా.. ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టి గొడవను సద్దుమణిగించారు.