తానా సభల్లో జూ.ఎన్‌టీఆర్ అభిమానులపై దాడి

తానా సభల్లో జూ.ఎన్‌టీఆర్ అభిమానులపై దాడి

అమెరికా వేదికగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు యుద్దానికి దిగారు. రెండు వర్గాలుగా చీలిపోయి పిడి గుద్దులు కురిపించుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరగటం గమనార్హం. జూ.ఎన్‌టీఆర్ పేరు ప్రస్తావనకు తీసుకురావడంతోనే రెండుగా చీలిపోయి కొట్టుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. 

జూ.ఎన్‌టీఆర్ పేరు ప్రస్తావించినందుకే గొడవ..!

సభలో జూ.ఎన్‌టీఆర్ అభిమానులు కొందరు అతని పేరును ప్రస్తావనకు తీసుకురావడంతోనే ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఇది నచ్చని టీడీపీ మద్దతుదారులు.. జూ.ఎన్‌టీఆర్ అభిమానులపై దాడికి దిగారని సమాచారం. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు రెండుగా చీలిపోయి చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ గొడవ జరగ్గా.. ఆయన విడదీసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న తరణి పరుచూరి, సతీష్ వేమన వర్గాలు

టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే కొట్లాట#TANA pic.twitter.com/lyGozFmZ1c

— Telugu Scribe (@TeluguScribe) July 9, 2023