మసీదులో మైనర్ బాలికపై అత్యాచారం..

మసీదులో మైనర్ బాలికపై అత్యాచారం..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ అమానుష ఘటన జరిగింది. ఢిల్లీలోని ఒక మసీదులో 12 ఏళ్ల బాలికపై 48 ఏళ్ల మతాధికారి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. మైనర్ బాలిక నీళ్ల కోసం మసీదులోకి వెళ్లగా.. అక్కడి మతాధికారి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక ఇంటికి చేరుకున్నాక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు.. ఘజియాబాద్ లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని కౌన్సెలింగ్ అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్ కు పంపామని పేర్కొన్నారు. కాగా, కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.