
రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట దుబారా ఖర్చు చేశారని కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు . కేసీఆర్ వ్యవహారశైలితో రాష్ట్రం దివాళా తీస్తోందని ఆయన అన్నారు. ఏపీలో రివర్స్ టెండరింగ్ తో 12 శాతం నిధులు ఆదా అయ్యాయన్న భట్టి.. రాష్ట్రంలోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్తే ….28 వేల కోట్ల రూపాయలు మిగిలేవన్నారు. మిషన్ భగీరథలో 6 వేల కోట్లు మిగిలేవన్నారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు భట్టి.