సల్మాన్‌ ఖాన్ ఇంటికెళ్లిన సీఎం ఏక్‌నాథ్ షిండే

సల్మాన్‌ ఖాన్ ఇంటికెళ్లిన సీఎం ఏక్‌నాథ్ షిండే

బాలీవుడ్ స్టార్  హీరో సల్మాన్ ఖాన్ ఇంటికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వెళ్లారు.  ఇటీవల సల్మాన్ ఇంటివద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ను ఆయన కలిశారు.  ఈ భేటీలో సల్మాన్‌ ఖాన్ తండ్రి సలీం ఖాన్ కూడా ఉన్నారు. భద్రతా ఏర్పాట్లపై సీఎం ఆరా తీశారు.  మహారాష్ట్రలో ఎలాంటి అండర్ వరల్డ్ కార్యకలాపాలను సహించేది లేదని సీఎం  అన్నారు. 

2024 ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ల వెలుపల ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు.  ఆ టైమ్ లో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.  నిందితులను విక్కీ గుప్తా, సాగర్‌పాల్‌గా గుర్తించారు. నిందితులిద్దరూ బీహార్‌లోని చంపారన్ జిల్లాకు చెందినవారు .  సల్మాన్‌కి ఇంతకుముందు చాలాసార్లు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి