ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం : సీఎం జగన్

 ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం  : సీఎం జగన్

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. విశాఖ జీ20 సదస్సుకు వచ్చిన వివిధ దేశాల ప్రముఖలతో జగన్ సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, 22  లక్షల  మందికి ఇళ్లు కడుతున్నామని చెప్పారు.

ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోందన్నారు.దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నానని సీఎం జగన్‌ చెప్పారు. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నానని సీఎం జగన్ వెల్లడించారు.