ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచి మంచి ఫలితాలు సాధించే విధంగా అధికారులకు సూచనలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వం వైద్యం కూడా అందాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు ఉచిత వైద్యంపై కసరత్తు చేయనున్నారు.
సమీక్ష విషయంపై ముందే సమాచారం ఉన్నా సరైన ప్రణాళిక లేకుండా అధికారులు హాజరవ్వడం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.