చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్‌పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ఇటీవల చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ పేరుతో తమ హయాంలో కట్టిన ఇండ్లు ఇవి .. మీ ప్రభుత్వంలో ఎన్ని ఇండ్లు కట్టారో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన సీఎం జగన్..  రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇలా ప్రతి పేదింటి ముందు నిలబడి ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగన మంచి ఇది అని చెప్పగలవా అంటూ ముఖ్యమంత్రి కీలక ప్రశ్నలు సంధించారు. టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని అందరూ నిలదీయాలని సీఎం పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో నాటి పాలనుకు... నేటి పాలను తేడా గమనించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు. ఇంత మంచి చేస్తోన్న సీఎం జగన్ తో కాకుండా మీతో సెల్ఫీ ఎలా దిగుతామంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. మంచి చేయడం అంటే మద్దతు మీడియా అధినేతల ఇంటికి, దత్త పుత్రుడు ఇళ్లకు మూటలు పంపడమా అని ప్రశ్నించాలన్నారు. అంతే కాకుండా గతంలో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు సూచించిన సినిమా గుర్తును ఉంచుకోవాలని జగన్ సూచించారు. తమ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతీ ఒక్కటి అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అబద్దాలు చెబుతారని, గజ దొంగల ముఠా ఒక్కటవుతుందంటూ వ్యాఖ్యానించారు. అబద్దాల బ్యాచ్ ను నమ్మొద్దంటూ సీఎం పిలుపునిచ్చారు.