కేసీఆర్ ఢిల్లీ టూర్ పొడిగింపు.. కారణమదేనా?

కేసీఆర్ ఢిల్లీ టూర్ పొడిగింపు.. కారణమదేనా?

ఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ భవన్ భూమిపూజ కోసం అక్కడికి వెళ్లిన సీఎం కేసీఆర్ పర్యటన మరో రెండు రోజులు పెరిగింది. దాంతో ఆయన మరో రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ సమయం పెరగడంతో రాష్ట్ర రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ లతో శుక్రవారం భేటీ అవుతారని తెలుస్తోంది. గోదావరి, కృష్ణా జలాల వ్యవహారం, కేంద్ర గెజిట్ తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనా మోడీతో చర్చించనున్నారు. శనివారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది.