ప్రధాని మోడీకి 10 వినతి పత్రాలు అందజేసిన కేసీఆర్

ప్రధాని మోడీకి 10 వినతి పత్రాలు అందజేసిన కేసీఆర్

ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు సీఎం కేసీఆర్. పది వినతిపత్రాలు ప్రధానికి అందించారు.  ఐపీఎస్ క్యాడర్ సమీక్షతో పాటు.. ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్క్,  హైదరాబాద్ - నాగ్ పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులు ఇవ్వాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం వినతిపత్రం అందించారు.  కరీంనగర్ లో ట్రిబుల్ ఐటీ,  హైదరాబాదులో ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని ప్రధానిని అడిగారు సీఎం.