డిసెంబర్ 1న ఆర్టీసీ కార్మికులతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో భేటీ కావాలని నిర్ణయించారు . ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ భేటీకి ఆహ్వానించాలని..వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండిని ఆదేశించారు కేసీఆర్.
సీఎంతో భేటీ కానున్న ఐదుగురు కార్మికుల్లో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలన్నారు. అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు. డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కార్మికులతో చర్చించనున్నారు కేసీఆర్ .