13న దళిత బంధుపై కేసీఆర్ సన్నాహక సమావేశం

13న దళిత బంధుపై కేసీఆర్ సన్నాహక సమావేశం

దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఈ క్రమంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం దళిత బంధు పథకం అమలు సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ సమావేశంలోఆయా నియోజక వర్గాలకు చెందిన నాయకులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొననున్నారు.