ధనవంతులూ రూ.5 మీల్స్ తింటున్నారు : కేసీఆర్

ధనవంతులూ రూ.5 మీల్స్ తింటున్నారు : కేసీఆర్
  • ధనవంతులూ రూ.5 మీల్స్ తింటున్నారు 
  • హరేకృష్ణ  ఆలయానికి రూ.25 కోట్లు ఇస్తాం
  • అక్షయ పాత్ర గొప్ప  ప్రోగ్రామ్ 
  • హరేకృష్ణ టవర్స్ కు  శంకుస్థాపన  చేసిన సీఎం కేసీఆర్ 

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని,  ఇక్కడ ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారని సీఎం కేసీఆర్  అన్నారు.  మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చిన వాళ్లే హింసను ప్రేరేపిస్తున్నారని తెలిపారు.  కోకాపేటలోని హరేకృష్ణ టవర్స్ కు  సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు.

మత మౌఢ్యం ప్రమాదకరమని,  అది మనుషులను పిచ్చి వాళ్లను చేస్తుందన్నారు. హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ప్రోగ్రామ్  ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని, ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుందన్నారు. హరేకృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.25కోట్లిస్తామని సీఎం ప్రకటించారు.