
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ కూడా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఐదుగురు కూడా విదేశాల నుంచి వచ్చారని..ఇద్దరు లండన్, ఇద్దరు దుబాయ్, ఒకరు స్కాట్లాండ్ నుంచి వచ్చారని చెప్పారు. కరోనా పాజిటివ్ వ్యక్తులకు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు. ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితుల్ని చేస్తున్న కరోనా కట్టడి కోసం అందరూ ఇళ్లకే పరిమితమై.. తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్న కేసీఆర్.. ప్రతి ఒక్కరూ చప్పట్టు కొట్టి సంఘీభావం తెలిపారన్నారు.
అందరూ ఒక్కటిగా ఉంటే దేనినైనా ఎదుర్కుంటామని..ప్రజలు అద్భుతంగా చాటి చెప్పారన్నారు. తెలంగాణ బిడ్డలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు సీఎం కేసీఆర్.