అభివృద్ధి ఎలా ఉంటుందో నేను చూపిస్తా

అభివృద్ధి ఎలా ఉంటుందో నేను చూపిస్తా

హాలియా: అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తాను చేసి చూపిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో నిర్వహించిన ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగర్ కు తాను వస్తే తమ బండారం బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని చెప్పారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రాకు తరలించినప్పుడు హస్తం పార్టీ నాయకులు నోరెత్తలేదని విమర్శించారు. తండాలు, ఆదివాసీ గూడెం లను కాంగ్రెస్ పట్టించుకోలేదని.. పోడు భూముల సమస్య కూడా ఆ పార్టీ పాపమేనన్నారు. నాగార్జున సాగర్ ను ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ ను గెలిపిస్తే కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని స్పష్టం చేశారు. పదవుల కోసం తెలంగాణను ఆంధ్రాకు వదిలింది కాంగ్రెస్ అని.. అదే తెలంగాణ కోసం పదవులను వదిలేసిన చరిత్ర టీఆర్ఎస్ ది వివరించారు.