ఎలిమినేడుకు సీఎం కేసీఆర్

ఎలిమినేడుకు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఎలిమినేడుకు వెళ్లనున్నారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తల్లి మంచిరెడ్డి పద్మమ్మ మే 18వ తేదీన మరణించారు. ఈక్రమంలో మే 28వ తేదీ ఆదివారం ఆమె దశదిన కర్మ కార్యక్రమాలు ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో జరుగనున్నాయి. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పరామర్శించేందుకు కేసీఆర్ ఎలిమినేడుకు వెళ్లనున్నారు. 

ఈ మేరకు కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు హెలిక్యాప్టర్‌‌లో బయలుదేరి.. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఫాంహౌజ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో దిగనున్నారు. అక్కడి నుండి ఎమ్మెల్యే స్వగృహానికి 12 గంటల సమయంలో వెళ్లి పరామర్శించనున్నారు. ఎలిమినేడు గ్రామానికి ఉన్న ప్రధాన రహదారులు అన్నీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండడంతో సీఎం వాయుమార్గాన చేరుకోనున్నారు. దీంతో అధికారులు ఎమ్మెల్యే మంచిరెడ్డి ఫామ్ హౌజ్ గ్రామంలోనికి వెళ్లే రహదారుల్లో భారీ బంధోబస్తును ఏర్పాటు చేశారు.