ఇవాళ పెద్దపల్లిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ పెద్దపల్లిలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

ఇవాళ పెద్దపల్లి  జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. రామగుండంలో నిర్మాణంలో ఉన్న 1600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ ను పరిశీలిస్తారు.  అక్కడే  ఎన్టీపీసీ,జెన్కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి ఎన్టీపీసీ జ్యోతి భవన్ లో బస చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి.

రేపు ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బరాజ్ పనులు పరిశీలిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. ఎన్టీపీసీలో రెండు హెలీపాడ్ లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి బస చేసే జ్యోతిభవన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు.