ఇవాళ (అక్టోబర్ 18న) జడ్చర్ల, మేడ్చల్‌కు సీఎం కేసీఆర్‌

ఇవాళ (అక్టోబర్ 18న) జడ్చర్ల, మేడ్చల్‌కు సీఎం కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ బుధవారం (అక్టోబర్​ 18న) మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. బుధవారం నిర్వహించే సభల విజయవంతానికి జడ్చర్ల ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు.

జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్‌ రోడ్డు శివాలయం సమీపంలో నిర్వహించే సభకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సభా ఏర్పాట్లను మంగళవారం (అక్టోబర్​ 17న) మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు. 

మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణం సీఎం కేసీఆర్‌, మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. సభ ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ శంభీపూర్‌ రాజు పరిశీలించారు.