19న మెదక్​కు కేసీఆర్.. 20న సూర్యాపేటలో పర్యటన

19న మెదక్​కు కేసీఆర్.. 20న సూర్యాపేటలో పర్యటన

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎంవో శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. 19న మెదక్​వెళ్లనున్న సీఎం అక్కడ ఇంటిగ్రేటెడ్​కలెక్టరేట్, డిస్ట్రిక్ట్​పోలీస్​ఆఫీస్​(ఎస్పీ ఆఫీస్) లను ప్రారంభించనున్నారు. 

అనంతరం మెదక్​జిల్లా బీఆర్ఎస్​ఆఫీస్​ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 20న కేసీఆర్​సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తారు. కలెక్టరేట్​కాంప్లెక్స్, ఎస్పీ ఆఫీస్, మెడికల్​కాలేజీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్​పార్టీ ఆఫీస్ను ప్రారంభిస్తారు.అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు..