భిక్కనూరు, వెలుగు:  మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన మాధుసూధన్ రెడ్డి, ర్యాగట్లపల్లి గ్రామానికి చెందిన మాధుసూధన్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురికాగా..   ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ  చొరవతో  సీఎం ఆర్ఎఫ్ అందినట్టు  మండలాధ్యక్షుడు భీమ్రెడ్డి తెలిపారు. ఈ చెక్కులను ఆదివారం బాధితులకు అందించారు. ఈ ఈకార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,  పీసీసీ రాష్ర్ట కార్యదర్శి బద్దం ఇంద్రకరన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, మాజీ ఎంపీపీ గాల్రెడ్డి, పార్టీ టౌన్ అధ్యక్షుడు అందె దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. 
 
